‘గవర్నర్ నిర్ణయం చట్ట విరుద్ధం’
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో..
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల ఆమోదంపై మండిపడ్డ న్యాయవాదులు
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. గవర్నర్ నిర్ణయం చట్టానికి వ్యతిరేకమని అంటున్నారు. న్యాయ సమీక్షలో ఈ రెండు చట్టాలు కొట్టివేసే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఇదే అంశంపై అమరావతి రైతుల తరఫున హైకోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాది ప్రసాద్ బాబు స్పందించారు. ఆ బిల్లుపై గవర్నర్ సంతకం చేయడం బాధాకరమన్నారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు రాజ్యాంగం ప్రకారం నిలబడే అవకాశం లేదన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేసేలా సవరణ తీసుకొస్తామన్నారు.
బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు సైతం ఈ అంశంపై స్పందించారు. గవర్నర్ విశ్వభూషణ్ తీసుకున్న ఈ నిర్ణయం న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిలిచే అవకాశం లేదన్నారు. ‘కేంద్ర ప్రభుత్వ రూపొందించిన పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి ఒకటే రాజధాని ఉండాలని స్పష్టంగా తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరణ చేస్తేగానీ మూడు రాజధానులు ఏర్పడే అవకాశం లేదు. సెక్షన్ 31(2) ప్రకారం న్యాయశాఖ రాజధానికి మార్చే అవకాశం లేదు’ అని సుబ్బారావు అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఎలాంటి చట్టాలు చేసినా భారత రాజ్యాంగం అధికరణ 13 ప్రకారం చెల్లుబాటుకావు అని అన్నారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయం చట్టవ్యతిరేకమైనదిగా పేర్కొన్నారు.
పలువురు న్యాయ నిపుణుల అభిప్రాయాల కోసం కింది వీడియోను చూడండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.