కరోనా ఎఫెక్ట్: యువతలో పెరిగిన ఆందోళన..!
కరోనా వైరస్ చూపిన ప్రభావంతో దాదాపు 31శాతం మంది కౌమర దశలో ఉన్న యువత తీవ్ర ఆందోళనకు గురైనట్లు తాజా సర్వే వెల్లడించింది.
దిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం దేశాల ఆర్థిక వ్యవస్థలతోపాటు వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై పడుతోంది. తాజాగా మనదేశ యువతపైనా ఇది ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ చూపిన ప్రభావంతో దాదాపు 31శాతం మంది కౌమర దశలో ఉన్న యువత తీవ్ర ఆందోళనకు గురైనట్లు తాజా సర్వే వెల్లడించింది. గత నాలుగు నెలల కాలంలో బాలికలు లింగ వివక్షకు గురికావడంతోపాటు చదువుకు కూడా దూరమవుతున్నట్లు తెలుస్తోంది. దేశంలోని కేవలం నాలుగు రాష్ట్రాల్లో జరిపిన ఈ సర్వేలో దాదాపు 7300మంది యువతీ, యువకులు పాల్గొన్నారు. ‘కరోనా - ప్రభావంపై యువత అభిప్రాయం’ పై సెంటర్ ఫర్ క్యాటలైజింగ్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థ ఓ సర్వే జరిపింది. ఏప్రిల్, జులై, ఆగస్టు నెలల్లో రెండు దఫాలుగా ఈ సర్వే నిర్వహించింది.
సర్వేలో పాల్గొన్న యువతీ, యువకుల్లో దాదాపు 31శాతం మంది తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి తీవ్ర ఆందోళన చెందినట్లు సర్వే వెల్లడించింది. అంతేకాకుండా ఈ నాలుగు నెలల కాలంలో బాలికలు తీవ్ర లింగ వివక్షతకు గురైనట్లు తేలింది. సర్వేలో పాల్గొన్న బాలికల్లో దాదాపు 12శాతం మంది ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేందుకు సొంత మొబైల్ ఫోన్లు కలిగి ఉండగా, అబ్బాయిల్లో మాత్రం 35శాతం మందికి ఫోన్లు ఉన్నట్లు గుర్తించింది. 51శాతం బాలికలు తమకు అవసరమైన పుస్తకాలు పొందలేదని ఇది అబ్బాయిలతో పోలిస్తే చాలా ఎక్కువని తెలుస్తోంది. మహమ్మారి విజృంభణ సమయంలో బాలికలు ఏ విధంగా చదువుకు దూరమయ్యారోననే విషయాన్ని ఇది తేటతెల్లందిచేస్తోందని నివేదిక స్పష్టంచేసిం. కుటుంబానికి ఆర్థికంగా చేదోడుగా నిలిచేందుకు దాదాపు 39శాతం బాలికలు సహాయం చేస్తుండగా, ఇది అబ్బాయిల్లో 35శాతంగా ఉంది. కేవలం 39శాతం మంది బాలికలు ఇంటినుంచి ఒంటరిగా బయటకు వెళ్లేందుకు అనుమతించగా.. 62శాతం అబ్బాయిలు స్వేచ్ఛగా తిరిగినట్లు నివేదిక తెలిపింది.
ఇక వివిధ అత్యవసర విభాగాలకు చెందిన హెల్ప్లైన్ల నెంబర్లను గుర్తించుకోవడంలోనూ యువత వెనుకబడే ఉంది. సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 36శాతం యువత వీటిని గుర్తుపెట్టుకోగా వీటి ఉపయోగం గురించి తెలిసిన వారిసంఖ్య మరింత తక్కువగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ