ఎయిరిండియా విమానాల్లో వృద్ధులకు రాయితీ
తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే వృద్ధులకు ఎయిరిండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. 60ఏళ్లకు పైబడి ఉన్న వ్యక్తులకు తమ టికెట్ రుసుములో 50శాతం రాయితీ ఇవ్వనున్నట్లు వారు ప్రకటించారు.
దిల్లీ: తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే వృద్ధులకు ఎయిరిండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. 60 ఏళ్లకు పైబడి ఉన్న వ్యక్తులకు తమ టికెట్ రుసుములో 50శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇది కేవలం దేశీయ విమానాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు ఎయిరిండియా తన వెబ్సైట్లోకి పేర్కొంది. భారతీయులై ఉండి, భారత్లో నివసిస్తున్న అరవై ఏళ్లకు పైబడిన వారు ఈ ఆఫర్కు అర్హులని తెలిపింది. ప్రయాణం చేసే నాటికి వారికి 60 ఏళ్లు ఉండాలని వారు పేర్కొంది. ఈ రాయితీ కేవలం టికెట్ రుసుముపైనే కాకుండా డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించిన అన్ని రుసుములకూ కలిపే 50 శాతం రాయితీ అని తెలిపారు. టికెట్ బుక్ చేసుకొనే సమయంలోనే ప్రజలు వారి గుర్తింపు కార్డును అనుసరించి వయసును నమోదు చేయాలని తెలిపారు. వీటిలో ఓటరు గుర్తింపు కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఎయిరిండియా జారీ చేసిన సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డులు అనుమతిస్తామని తెలిపారు. తనిఖీ సమయంలో సరైన గుర్తింపుకార్డులు సమర్పించకపోతే టికెట్ పూర్తి రుసుమును చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు ఈ రాయితీని ఉపయోగించుకొని దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్లొచ్చన్నారు. ప్రయాణానికి మూడురోజులు ముందుగా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి