దిల్లీ వెళ్లిన అమరావతి మహిళా ఐకాస నేతలు

అమరావతి మహిళా ఐకాస నేతలు దిల్లీ బయల్దేరి వెళ్లారు. రాజధాని మారకుండా చూడాలంటూ అన్ని పార్టీల పెద్దలకు విన్నవించేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి పయనమయ్యారు. రాజధాని రైతుల కష్టాలను నేతలకు తెలియజేస్తామని...

Published : 20 Sep 2020 21:29 IST

గన్నవరం: అమరావతి మహిళా ఐకాస నేతలు దిల్లీ బయల్దేరి వెళ్లారు. రాజధాని మారకుండా చూడాలంటూ అన్ని పార్టీల పెద్దలకు విన్నవించేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి పయనమయ్యారు. రాజధాని రైతుల కష్టాలను నేతలకు తెలియజేస్తామని ఈ సందర్భంగా మహిళా ఐకాస నేతలు స్పష్టం చేశారు. అమరావతి ఒక ప్రాంతానికి చెందినది కాదని.. ఐదుకోట్ల ప్రజల సమస్య అనే విషయాన్ని నేతలకు వివరిస్తామన్నారు. ఈ అంశంపై ఆయా పార్టీల నేతలకు వినతిపత్రాలు అందజేస్తామని మహిళలు తెలిపారు. అమరావతిపై వైకాపా ఎంపీలు విషం చిమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీ వెళ్లేముందు జై అమరావతి, ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని అంటూ మహిళా ఐకాస నేతలు నినాదాలు చేశారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు