కనిమొళిని కలిసిన అమరావతి ఐకాస నేతలు

అమరావతిలో రాజధానిని కొనసాగించాల్సిన ఆవస్యకతను తెలియజేసేందుకు దిల్లీ వెళ్లిన మహిళా ఐకాస నాయకులు డీఎంకే ఎంపీ కనిమొళిని కలిశారు...

Updated : 21 Sep 2020 16:26 IST

దిల్లీ: అమరావతిలో రాజధానిని కొనసాగించాల్సిన ఆవస్యకతను తెలియజేసేందుకు దిల్లీ వెళ్లిన మహిళా ఐకాస నాయకులు డీఎంకే ఎంపీ కనిమొళిని కలిశారు. వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఐకాస నాయకులను కనిమొళి వద్దకు తీసుకెళ్లారు. ఐకాస నేతలు సుంకర పద్శశ్రీ, వనజ, తంగిరాల సౌమ్యతోపాటు మహిళా రైతులు అమరావతి అంశాన్ని కనిమొళికి వివరించారు. తమ ఆందోళనకు మద్దతివ్వాలని కోరారు. అనంతరం గల్లా జయదేవ్‌ నివాసంలో తెదేపా ఎంపీలతో వారంతా భేటీ అయ్యారు. రాజధాని అంశాన్ని జాతీయనేతల దృష్టికి తీసుకెళ్లే అంశాన్ని చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని