ఈ వీడియో నాకెంతో ఉత్సాహాన్నిస్తుంది: మహీంద్రా
సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖుల్లో పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఒకరు. ఆసక్తికర ట్వీట్లు చేయడంతో పాటు, అవసరంలో ఉన్న వారికి తన వంతు సహాయం చేస్తుంటారు....
ముంబయి: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖుల్లో పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఒకరు. ఆసక్తికర ట్వీట్లు చేయడంతో పాటు, అవసరంలో ఉన్న వారికి తన వంతు సాయం చేస్తుంటారు. అలానే దేశీయంగా కొత్త ఆవిష్కరణలను చేపట్టే వారిని ప్రోత్సహిస్తుంటారు. వాటితో పాటు స్ఫూర్తిమంతమైన వ్యక్తుల గురించి కూడా ఆయన ట్విటర్లో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం అది నెటిజన్లనను ఆకట్టుకుంటోంది. వీడియోలో ఒక చిన్న పిల్లాడు అమాయకత్వం నిండిన కళ్లతో, తన బుజ్జి మాటలతో ఎంతో ధ్యాసగా జాతీయ గీతాన్ని ఆలపిస్తూ కనిపిస్తున్నాడు.
ఈ వీడియోను మహీంద్రా షేర్ చేస్తూ ‘‘ ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నా ఉత్సాహాన్ని మరింత పెంచుకునేందుకు ఈ వీడియోను చూస్తాను. దీన్ని ఇప్పటి వరకు చాలాసార్లు చూశాను. నిష్ణాతులైన సంగీత కళాకారులు మన జాతీయ గీతాన్ని ఆలపించినప్పుడు వచ్చిన అనుభూతే నాకు ఈ వీడియో చూసినప్పుడూ కలుగుతుంది. ఆ పిల్లవాడి అమాయకత్వం, శ్రద్ధ నన్ను ఎప్పుడూ ఆకర్షిస్తాయి’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను రెండున్నర లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లవాడిని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
-
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’