అమరావతి రైతుల మహా పాదయాత్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి శంకుస్థాపన జరిగి నేటికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా శంకుస్థాపన ఘట్టానికి గుర్తుగా రైతులు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు....
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి శంకుస్థాపన జరిగి నేటికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా శంకుస్థాపన ఘట్టానికి గుర్తుగా రైతులు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాయపూడి, మందడం, గుంటూరు నుంచి పుణ్యస్థలి(ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం)వరకు రైతులు, మహిళలు మహా పాదయాత్ర చేపట్టారు. గుంటూరు మదర్థెరిస్సా విగ్రహం నుంచి రైతులు తమ పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రకు ఐకాస నేతలు తరలి వెళ్లారు. కొవిడ్ నిబంధనల మేరకు పాదయాత్ర చేసుకోవాలని పోలీసులు వారికి సూచించారు. రాష్ట్ర ప్రజల ఆశల రాజధానికి సమాధి వేయాలని చూస్తున్న సీఎం జగన్ ఇకనైనా మనసు మార్చుకోవాలని ఈ సందర్భంగా ఐకాస నేతలు, రైతులు హితవు పలికారు.
పుణ్యస్థలి వద్ద పలు కార్యక్రమాలు..
ఐదేళ్లు పూర్తైన సందర్భంగా పుణ్యస్థలి వద్ద పలు కార్యక్రమాలు చేపట్టినట్లు ఐకాస కన్వీనర్ సుధాకర్ తెలిపారు. ‘రాజధాని అమరావతి-నాటి వైభవం-నేటి దుస్థితి’ పేరుతో నిరసన చేపట్టి అమరావతిని కాపాడాలంటూ కేంద్రాన్ని వేడుకోనున్నట్లు చెప్పారు. ప్రధానిని అర్థిస్తూ ‘అమరావతి చూపు-మోదీ వైపు’ పేరుతో వినూత్న ప్రద్శన చేపట్టనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమరావతి ఆవశ్యకత, రక్షణపై ప్రముఖులు సందేశాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రాత్రి దీక్షా శిబిరాల వద్ద ‘అమరావతి వెలుగు’ పేరుతో కాగడాల ప్రదర్శన చేపట్టినట్లు ఆయన వివరించారు. రైతులు, మహిళలు అంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM