రానున్న రోజుల్లో మరిన్ని విపత్తులు

బోనాల సందర్భంగా పాతబస్తీ నిమిలాం మండి మహాంకాళేశ్వరి ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు.

Updated : 20 Jul 2020 16:05 IST

హైదరాబాద్‌: బోనాల సందర్భంగా పాతబస్తీ మీరాలం మండి మహాంకాళేశ్వరి ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. రంగంలో పాల్గొన్న స్వర్ణలత భవిష్య వాణి చెప్పారు. ఆషాఢ మాసం బోనాలు, పూజలతో సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో విపత్తులున్నాయని, జాగ్రత్త వహించాలని భక్తులను హెచ్చరించారు. ప్రజలందరినీ రక్షిస్తానని అభయమిచ్చారు. ఐదు వారాల పాటు శాకాలు సమర్పించాలని కోరారు. దేవాలయం అధ్యక్షుడు గాజుల అంజయ్య మాట్లాడుతూ.. భక్తులంతా భౌతిక దూరం పాటించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని