‘హైదరాబాద్లో 6లక్షల మందికి కరోనా!’
హైదరాబాద్లో దాదాపు 6లక్షల మంది కరోనా బారినపడినట్టు సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) - సీఎస్ఐఆర్ సంయుక్త అధ్యయనంలో తేలింది. వీరిలో ఎక్కువ మందిలో కరోనా లక్షణాలు లేవని.........
సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్: నగరంలో దాదాపు 6లక్షల మంది కరోనా బారినపడినట్టు సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) - సీఎస్ఐఆర్ సంయుక్త అధ్యయనంలో తేలింది. వీరిలో ఎక్కువ మందిలో కరోనా లక్షణాలు లేవని.. వారు ఆస్పత్రికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది. కరోనా రోగుల నుంచి కేవలం ముక్కు ద్వారానే కాకుండా నోటి నుంచి, మలమూత్రాల నుంచి కూడా వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందని పేర్కొంది. నగరంలోని వేర్వేరు మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించిన అనంతరం సీసీఎంబీ ఈ విషయాలను వెల్లడించింది.
ఈ పరిశోధన ప్రకారం.. 80శాతం మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లను పరిశీలించగా దాదాపు 2లక్షల మందికి కరోనా సోకినట్టు తేలింది. అయితే, నగరంలోని మురుగునీరులో 40శాతం మాత్రమే శుద్ధీకరణ ప్లాంట్లకు చేరుతున్నందున హైదరాబాద్లో మొత్తంగా 6లక్షల మంది ఈ వైరస్ బారిన పడి ఉండటం గానీ, ఈ మహమ్మారి నుంచి బయటపడి ఉండి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే నగరంలో దాదాపు 6 శాతం ప్రజలు గడిచిన 35 రోజుల్లో కరోనా బారినపడడమో, దాన్నుంచి కోలుకోవడమో జరిగి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరిలో లక్షణాల ఉన్నవారు, లేనివారు కూడా ఉంటారని సీసీఎంబీ తెలిపింది. వీరు గుర్తించిన అంశాలన్నీ ప్రీప్రింట్ సర్వర్మెడ్ ఆర్ఎక్స్ఐవీలో పోస్ట్ చేశారు.
తెలంగాణ సర్కార్ ఆగస్టు 19న విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 95,700 మంది కరోనా బారిన పడ్డారు. ఈ తరహా ప్రయోగాలకు స్థానిక యంత్రాంగాలు కూడా కలిసి వస్తే హాట్స్పాట్లను త్వరితగతిన గుర్తించి వైరస్ కట్టడికి చర్యలు చేపట్టే ఆస్కారం ఉంటుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. తమ పరిశోధనలో వైరస్ సోకినవారిలో ఎక్కువ మంది ఏ విధమైన కరోనా లక్షణాలూ లేనివారేనని, వారు ఆస్పత్రికి కూడా వెళ్లాల్సిన అవసరం వచ్చి ఉండదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల