కశ్మీర్‌లో హిమపాతం.. జవాను మృతి

జమ్మూకశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని ఆర్మీ పోస్టులో హిమపాతం భీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒక జవాను మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మంగళవారం రాత్రి సుమారు 8.....

Published : 18 Nov 2020 16:00 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని ఆర్మీ పోస్టులో హిమపాతం భీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒక జవాను మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మంగళవారం రాత్రి సుమారు 8 గంటలకు తంగ్దర్‌ ప్రాంతంలోని ఆర్మీపోస్టును భారీ మంచు చరియ ఢీకొట్టగా ముగ్గురు సైనికులు కొట్టుకుపోయారు. వారిని ఆస్పత్రికి తరలించగా ఒకరు పరిస్థితి విషమించి మరణించారు. హిమపాతం పరిస్థితి తీవ్రం కావడంతో కశ్మీర్‌లోయలో ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. కశ్మీర్‌లోని కుప్వారా, బందిపోరా జిల్లాలకు మధ్యస్థాయి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గండర్‌బల్‌, బారాముల్లా జిల్లాలకు తక్కువ స్థాయి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు