ఉలి చేతబట్టి...అవార్డులు కొల్లగొట్టి...
ఆ యువతి చేయి వేస్తే ఎలాంటి శిలైనా...అందమైన శిల్పం కావాల్సిందే. ఎంతటి కరుకు రాయి అయినా...ఆమె ఉలి దెబ్బకు కళాత్మకంగా మారిపోవాల్సిందే. దశాబ్దాలుగా పురుషుల ఆధిక్యం కొనసాగుతున్న శిల్పకళా రంగంలో తనదైన ముద్ర వేస్తూ..
ఇంటర్నెట్ డెస్క్ : ఆ యువతి చేయి వేస్తే ఎలాంటి శిలైనా...అందమైన శిల్పం కావాల్సిందే. ఎంతటి కరుకు రాయి అయినా...ఆమె ఉలి దెబ్బకు కళాత్మకంగా మారిపోవాల్సిందే. దశాబ్దాలుగా పురుషుల ఆధిక్యం కొనసాగుతున్న శిల్పకళా రంగంలో తనదైన ముద్ర వేస్తూ.. మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపిస్తోందామె. అంతేకాదు సామాజిక మాధ్యమాలను వారధిగా మలచుకుని... ఆకట్టుకునే శిల్పాలను దేశవిదేశాలకు ఎగుమతి చేస్తోంది. అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. ఆమే మహిళా శిల్పి భువనేశ్వరి.
కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డకు రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రముఖ శిల్ప కళాకారులకు, అందమైన శిల్పాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ శిల్పాలు అవసరమైనా ఈ ఊరి వైపే చూస్తుంటారు. అలాంటి ఆళ్లగడ్డలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది భువనేశ్వరి. శిల్పాలను అందంగా చెక్కుతూ ఆకట్టుకుంటోదామె. వారి కుటుంబంలో అందరూ శిల్ప కళాకారులే. శ్రీశైలంలోని భ్రమరాంబికా ఆలయం, మహానందిలోని అద్దాల మండపం, అహోబిలంలోని కోనేరు వంటి ప్రసిద్ధ నిర్మాణాల వెనుక ఆమె కుటుంబీకులు ఉన్నారు.
ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలకున్నా...
తాత నుంచి తండ్రి, అక్కడి నుంచి భువనేశ్వరీ.. ఇలా వారసత్వంగా ఈ కళను ఆమె నేర్చుకుంది. శిల్పకళలో తండ్రి దగ్గర ఓనమాలు దిద్దుతూనే చదువును కొనసాగించింది. బీఈడీ పూర్తి చేసింది. కళాశాల రోజుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలనుకున్న ఆమె ఆ దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ విజయం సాధించలేక పోయింది. దాంతో తనకు ఎంతో ఇష్టమైన శిల్పకళలోనే రాణించాలని నిర్ణయం తీసుకుంది. అలా ఈ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె ఇందులో కొత్త పంథాను తీసుకువచ్చింది. శిల్పకళకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంది. అంతకు ముందున్న పరిస్థితిని మార్చివేసింది. ఫేస్బుక్, వాట్సప్, ఓఎల్ఎక్స్, యూట్యూబ్ వంటి వాటి ద్వారా శిల్పాలను మార్కెటింగ్ చేయటం ప్రారంభించింది.
ఆమె తయారు చేసిన ఎన్నో శిల్పాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో దర్శనమిస్తున్నాయి. ద్రాక్షారామంలో శివుడి ధ్యానముద్ర విగ్రహం, లేపాక్షి నంది విగ్రహాలను ఆమెనే రూపొందించింది. గోదావరి పుష్కరాల సమయంలో పదమూడు అడుగుల విగ్రహాన్ని కేవలం ఇరవై అయిదు రోజుల్లో రూపొందించి ఔరా అనిపించింది. కృష్ణవేణి విగ్రహం, శ్రీశైల శిఖరం మీద ఉండే నంది విగ్రహం ఇలా ఎన్నింటికో రూపాన్నిచ్చింది. భువనేశ్వరి తయారు చేసిన విగ్రహాలు, గృహాలంకరణ వస్తువుల ఫొటోలు చూసిన ఓ విదేశీ మహిళ ఆమెతో ఆరడుగుల బుద్ధుడి విగ్రహాన్ని తయారు చేయించింది. సాధారణ వ్యక్తులే కాకుండా ప్రభుత్వాలు కూడా ఆమెకు ఆర్డర్లు ఇచ్చేవి.
కేవలం దేవతా మూర్తుల విగ్రహాల తయారీకే ఆమె పరిమితం కాలేదు. ఈ కాలానికి అనుగుణంగా నైపుణ్యాన్ని అభివృద్ధి పరచుకొంటూ శిల్పాలను రూపొందిస్తోంది. ఇంటీరియర్ డెకరేషన్స్కు అవసరమయ్యే బొమ్మలు తదితరాలను అందంగా తీర్చిదిద్దుతోంది. శిల్పకళలో గొప్పగా రాణిస్తోన్న భువనేశ్వరిని ఎన్నో అవార్డులు వరించాయి. 2015లో ఉత్తమ ప్రతిభా అవార్డు, 2018లో లేడీ లెజెండ్ పురస్కారం, అదే ఏడాది విశ్వకర్మ లెజెండరీ అవార్డును కూడా ఆమె సొంతం చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
మల్టీజోన్ -1 పరిధిలో విధుల్లో అలసత్వం వహించిన ఆరుగురు పోలీసు అధికారులను ఐజీ ఏవీ రంగనాథ్ సస్పెండ్ చేశారు. -
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!