ఛార్జిషీట్పై సవాలుకు అర్ణబ్కు అనుమతి
తనపై దాఖలు చేసిన అభియోగపత్రం(ఛార్జిషీట్)ను సవాలు చేసేందుకు రిపబ్లిక్ టీవీ ఎడిటర్, ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామికి బొంబాయి హైకోర్టు అనుమతినిచ్చింది.
ముంబై: తనపై దాఖలు చేసిన అభియోగపత్రం(ఛార్జిషీట్)ను సవాలు చేసేందుకు రిపబ్లిక్ టీవీ ఎడిటర్, ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామికి బొంబాయి హైకోర్టు అనుమతినిచ్చింది. రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఇంటీరియర్ డిజైనర్ కేసులో తన క్లయింటు, మరో ఇద్దరిపై అలీబాగ్ మెజిస్ట్రేట్ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసినట్లు అర్ణబ్ న్యాయవాది అబాద్ పాండా హైకోర్టుకు తెలిపారు. అర్ణబ్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారించేందుకు ఆయన న్యాయవాది ఆబాద్ బొంబాయి హైకోర్టును కొంత సమయం కోరారు. ఈ అంశంపై జనవరి 6వ తేదీన విచారణ చేయనున్నారు. 2018లో ఆత్మహత్య చేసుకున్న ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ కేసులో నవంబరు 4వ తేదీన గోస్వామితో పాటు మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఖండించిన అర్ణబ్ ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని, తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాగా హైకోర్టు ఆయన అభ్యర్థనను కొట్టివేసింది. దీంతో అర్ణబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించి నవంబరు 11న బెయిల్ పొందారు. ఈ నెల ప్రారంభంలో ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న ముగ్గురిపై పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. తాజాగా దీన్ని సవాలు చేసేందుకు ఆయన అనుమతి పొందారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..