‘హోంసిక్’ బెంగ తొలగడానికి.. ఎయిర్బాటిల్స్!
ఒకదేశం నుంచి మరో దేశానికి వస్తువుల్ని రవాణా చేయడం చూసుంటాం. మరి బాటిళ్ల ద్వారా గాలిని ఒక దేశం నుంచి మరోదేశానికి చేరవేయడం గురించి ఎప్పుడైనా విన్నారా? అంటే చాలా మంది లేదనే చెప్తారు కదా.
లండన్: ఒకదేశం నుంచి మరో దేశానికి వస్తువుల్ని రవాణా చేయడం చూసుంటాం. మరి బాటిళ్ల ద్వారా గాలిని ఒక దేశం నుంచి మరోదేశానికి చేరవేయడం గురించి ఎప్పుడైనా విన్నారా? అంటే చాలా మంది లేదనే చెప్తారు కదా. కానీ యూకేకు చెందిన ‘మై బ్యాగేజ్’ అనే ఓ వస్తు రవాణా కంపెనీ అలాంటి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. విదేశాల్లో ఉంటున్న బ్రిటన్ జాతీయులకు స్వదేశంపై ఉన్న బెంగ(హోంసిక్)ను తొలగించేందుకు గాలి బాటిళ్లను చేరవేసే వింత నిర్ణయాన్ని అమలు చేస్తోంది.
‘మై బ్యాగేజ్’ అనే సంస్థ వస్తువుల రవాణా సంస్థ ఇటీవల ఎయిర్ బాటిల్స్ సేవలను ప్రారంభించింది. ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ దేశాల్లో స్వచ్ఛమైన గాలిని బాటిళ్లలో నింపి విదేశాల్లోని తమ వారికి చేరవేసే సేవలను ప్రారంభించింది. ఒక 500ఎంఎల్ బాటిల్ ధరను రూ.2,500గా విక్రయిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘విదేశాల్లో ఉండే మా దేశస్థులు తమ ఇంటితో కలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ బాటిల్స్కు అమర్చిన కార్క్ స్టాపర్ను తెరిచి వినియోగదారులు ఒక్క క్షణం శ్వాస తీసుకుని స్వదేశీ అనుభూతిని పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా వారు కొంతైనా స్వదేశంపై తమకున్న బెంగను(హోంసిక్ ఫీలింగ్స్) తీర్చుకోవచ్చు’ అని తెలిపారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.