అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం జగన్‌ కాన్వాయ్‌

ఏపీ సీఎం జగన్‌ మరోసారి తన మానవత్వాన్ని  చాటుకున్నారు. కడప జిల్లా పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న అనంతరం మార్గమధ్యంలో సీఎం కాన్వాయ్‌ వేగం తగ్గించి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. జగన్‌ కాన్వాయ్‌ గన్నవరం ...

Published : 02 Sep 2020 20:52 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ మరోసారి తన మానవత్వాన్ని  చాటుకున్నారు. కడప జిల్లా పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న అనంతరం మార్గమధ్యంలో సీఎం కాన్వాయ్‌ వేగం తగ్గించి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. జగన్‌ కాన్వాయ్‌ గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్తుండగా గూడవల్లి-నిడమానూరు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తిని అత్యవసరంగా ఆస్పత్రికి తరలించాల్సి రావడంతో సీఎం కాన్వాయ్‌ కొద్దిగా వేగం తగ్గించుకుని అంబులెన్స్‌కు దారిచ్చింది. 

ఉయ్యూరు నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి గన్నవరం వద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఆయన్ను ఎన్‌హెచ్‌ఏఐకు చెందిన అంబులెన్స్‌లో విజయవాడలోని ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో జగన్‌ కాన్వాయ్‌ వెళ్తుండటంతో ముందుగా అంబులెన్స్‌కు దారివ్వాలని సీఎం తన సిబ్బందికి సూచించారు. సీఎం సూచనలతో కాన్వాయ్‌ వేగాన్ని తగ్గించి అంబులెన్స్‌కు దారిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని