ఏపీలో అవినీతి నిరోధానికి దిశ తరహా బిల్లు

అధికారులు లంచం తీసుకుంటూ దొరికితే నిర్దిష్ట సమయంలోనే చర్యలు తీసుకునేలా బిల్లు తీసుకురావాలని ఉన్నతాధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. అవినీతి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

Published : 24 Aug 2020 21:23 IST

రూపొందించాలని సీఎం జగన్‌ ఆదేశం

అమరావతి: అధికారులు లంచం తీసుకుంటూ దొరికితే నిర్దిష్ట సమయంలోనే చర్యలు తీసుకునేలా బిల్లు తీసుకురావాలని ఉన్నతాధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. అవినీతి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. అవినీతి నిరోధానికి ‘దిశ’ తరహాలో బిల్లు రూపొందించాలని ఆదేశించారు. 1902కు వచ్చే అవినీతి సంబంధ ఫిర్యాదులన్నీ అవినీతి నిరోధకశాఖకు చెందిన 14400కు బదలాయించాలని సీఎం స్పష్టం చేశారు.

గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులను అనుసంధానించాలని సీఎం నిర్దేశించారు. తహశీల్దార్‌, ఎంపీడీవో, సబ్‌రిజిస్ట్రార్‌, మున్సిపల్‌, పట్టణ ప్రణాళిక కార్యాలయాల్లో జరిగే అవినీతిపై ప్రధానంగా దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని.. టెండర్‌ విలువ రూ.కోటి దాటితే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని