యుద్ధప్రాతిపదికన పోలవరం పనులు: జగన్
ప్రాధాన్యతాక్రమంలో పోలవరం పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టును విహంగవీక్షణం ద్వారా పరిశీలించిన అనంతరం ఇంజినీర్లు
ప్రాజెక్టు పరిశీలన అనంతరం అధికారులతో సీఎం సమీక్ష
పోలవరం: ప్రాధాన్యతాక్రమంలో పోలవరం పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టును విహంగవీక్షణం ద్వారా పరిశీలించిన అనంతరం ఇంజినీర్లు, అధికారులు, గుత్తేదార్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పునరావాస కార్యక్రమాలకు కనీసం రూ.3,330 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 2022 ఖరీఫ్ నాటికి సాగునీరు ఇవ్వాలన్నారు. వచ్చే జూన్ 15 నాటికి మళ్లీ గోదావరిలో నీళ్లు వస్తాయని.. ఆలోపే యుద్ధప్రాతిపదికన పనులను పూర్తిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. మే నెలాఖరుకు స్పిల్వే, స్పిల్ ఛానల్ పనులు సంపూర్ణంగా పూర్తికావాలన్నారు. పనులన్నీ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని జగన్ సూచించారు.
ఎత్తు మిల్లీమీటరు కూడా తగ్గించం
పోలవరం డ్యామ్ ఎత్తు మిల్లీమీటరు కూడా తగ్గించడం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. డ్యామ్ నిర్మాణంతో పాటు పునరావాస కార్యక్రమాలు కీలకమన్నారు. వచ్చే మే నెలాఖరు నాటికి పునరావాస కాలనీలు పూర్తి చేసి నిర్వాసితుల తరలింపునకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ను సీఎం జగన్ ఆదేశించారు. డెల్టాకు సాగు, తాగునీటి కొరత రాకుండా చూడాలన్నారు. ప్రత్యామ్నాయాలపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని.. దాన్ని ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని చెప్పారు. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించారు.
సీఎం జగన్ పోలవరం పర్యటన సందర్భంగా నిర్వాసితులు ఆయన్ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు సీఎంకు వినతిపత్రం అందజేశారు. సమస్యలు పరిష్కరిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రాజెక్టు సంబంధించిన చిత్రప్రదర్శనను సీఎం పరిశీలించారు. అధికారులతో సమీక్ష అనంతరం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి బయల్దేరి వెళ్లారు. సీఎం పోలవరం పర్యటన సందర్భంగా డ్రోన్ ద్వారా ఆ ప్రాంతాన్ని చిత్రీకరించారు.
ఇవీ చదవండి..
అమరావతిలోనే రాజధాని: సోమువీర్రాజు
టీచర్ల బదిలీల్లో రాజకీయం సిగ్గుచేటు: అచ్చెన్న
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా