తెలంగాణ పత్తికి బ్రాండ్ ఇమేజ్ తేవాలి: కేసీఆర్
అత్యంత నాణ్యతతో కూడిన పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ వచ్చేలా బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో
హైదరాబాద్: అత్యంత నాణ్యతతో కూడిన పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ వచ్చేలా బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణపై మంత్రి నిరంజన్ రెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పత్తి సాగు, మార్కెటింగ్పై ఆయన సూచనలు చేశారు. రాష్ట్రంలో పండే పత్తి దేశంలోనే అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని.. ప్రపంచంలో అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి, వాటిని ప్రచారం చేసేందుకు అవసరమైన వ్యూహం రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనికోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిపుణులతో ఓ సదస్సు నిర్వహించాలన్నారు.
అంతర్జాతీయంగా మరింత డిమాండ్ వచ్చేలా పత్తిశుద్ధి, ప్యాకింగ్ అంశాల్లో రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని కేసీఆర్ సూచించారు. 60 లక్షల ఎకరాలతో దేశంలోనే ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. సాగునీటి ద్వారా సాగు చేసే భూముల్లో పత్తిపంట మరింత బాగా వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులతో సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చినందున కాల్వల కింద పత్తిని సాగు చేస్తే మరింత లాభసాటిగా ఉంటుందని చెప్పారు. పత్తికి మంచి మార్కెట్ వచ్చేలా ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు తీసుకుందని.. జిన్నింగ్ మిల్లుల సంఖ్యను 60 నుంచి 300కు పెంచేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పత్తి ఎక్కువగా పండే ప్రాంతాల్లో జిన్నింగ్ మిల్లులను నెలకొల్పేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. లాభసాటి పంటలనే పండించాలన్న ప్రభుత్వ సూచనలను రైతులు పాటించి నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తున్నారని, ఇది మంచి సంప్రదాయమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లో పత్తి, నూనె గింజలు, పప్పులకు మంచి డిమాండ్ ఉందన్నారు. కూరగాయలకు కూడా మంచి ధర వస్తున్నందున వాటినీ ఎక్కువగా పండించాలని చెప్పారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!