‘సైబ్-హర్’తో మరో అద్భుతం: కేసీఆర్
కరోనా వైరస్ వ్యాప్తితో తీవ్ర భయాందోళనకు గురవుతున్న ప్రజలు ఇంటర్నెట్ వినియోగం వైపు మొగ్గు చూపడంతో సైబర్ నేరగాళ్లు పెట్రేగిపోతున్న......
మహిళా భద్రతా విభాగానికి కేసీఆర్ అభినందనలు
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తితో తీవ్ర భయాందోళనకు గురవుతున్న ప్రజలు ఇంటర్నెట్ వినియోగం వైపు మొగ్గు చూపడంతో సైబర్ నేరగాళ్లు పెట్రేగిపోతున్న వేళ తెలంగాణ మహిళా భద్రతా విభాగం చేపట్టిన కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ముఖ్యంగా మహిళలు, ఆన్లైన్ చదువుల్లో నిమగ్నమైపోయిన విద్యార్థులు ఈ నేరాల బారిన పడే ప్రమాదం ఉన్నందున ‘సైబ్-హర్’ పేరుతో చేపట్టిన ఆన్లైన్ అవగాహన కార్యక్రమంపై ఆయన స్పందించారు. నెల రోజుల పాటు ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించి దాదాపు 15లక్షల మందికి సైబర్ నేరాలు జరిగే విధానం, దాని బారినపడకుండా ఉండేందుకు అవసరమైన రక్షణ మార్గాలపైనా, అప్రమత్తతపైనా అవగాహన కల్పించిందని సీఎం లేఖలో పేర్కొన్నారు. సైబర్ నేరాలకు సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను వెలువరించిందన్నారు. మహిళలు, పిల్లల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్రం ‘సైబ్-హర్’ పేరుతో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంతో మరో అద్భుతం సాధించిందన్నారు. దీన్ని నిర్వహించిన రాష్ట్ర పోలీస్శాఖ మహిళా భద్రతా విభాగాన్ని మనసారా అభినందిస్తున్నట్టు లేఖలో తెలిపారు. సీఎం కేసీఆర్ ఇటీవల రాసిన ఈ లేఖను డీజీపీ మహేందర్ రెడ్డి విడుదల చేశారు. మహిళా భద్రతా విభాగం నిబద్ధత, కృషికి ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు వచ్చాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?