కొత్తగా 8,555 కేసులు.. మరో 67 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇవాళ కొత్తగా...

Published : 02 Aug 2020 19:20 IST

బులిటెన్‌ విడుదల చేసిన ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇవాళ కొత్తగా 8,555 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,58,764కి చేరింది. మరో 67 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు కరోనాతో 1,474 మంది మృతి చెందారు. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 74,404 మంది చికిత్స పొందుతుండగా.. 82,886 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 
నిన్న ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల్లోపు  52,834 నమూనాలను పరీక్షించినట్లు వైద్య శాఖ తెలిపింది. కొవిడ్‌ వల్ల కృష్ణాలో 11 మంది, గుంటూరులో ఎనిమిది, తూర్పుగోదావరిలో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, కర్నూలులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 6,272 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని ప్రభుత్వం తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 20,65,407 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని