ఆరోగ్యంపై లాక్డౌన్ ప్రభావం ఎలా ఉందంటే!
స్థూలకాయం ఉన్నవారిలో లాక్డౌన్ కారణంగా సమస్యలు మరింత ఎక్కువైనట్లు తేలింది. అంతేకాకుండా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపడంతోపాటు నాణ్యమైన నిద్ర కూడా కరువైందని ‘జర్నల్ ఒబేసిటీ’లో ప్రచురితమైన తాజా అధ్యయనం స్పష్టంచేసింది.
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో ప్రపంచం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మార్చి నుంచి ఏప్రిల్ కాలంలో ప్రపంచంలోని చాలా దేశాల్లోని ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవ్వరూ ఊహించని ఈ పరిస్థితి వ్యక్తుల ఆహారం, నిద్ర అలవాట్ల మార్పులకు కారణమయ్యింది. అయితే, ఇది ఎంతవరకు ప్రభావం చూపాయనే విషయంపై ప్రపంచంలోనే తొలిసారిగా ఓ అధ్యయనం చేపట్టారు. అమెరికాలోని లౌసియానా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన సర్వే ప్రకారం, స్థూలకాయం ఉన్నవారిలో లాక్డౌన్ కారణంగా సమస్యలు మరింత ఎక్కువైనట్లు తేలింది. అంతేకాకుండా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపడంతోపాటు నాణ్యమైన నిద్ర కూడా కరవైందని ‘జర్నల్ ఒబెసిటీ’లో ప్రచురితమైన తాజా అధ్యయనం స్పష్టంచేసింది.
లాక్డౌన్తో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం వారి జీవణశైలిలో మార్పులు వచ్చినట్లు పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా వ్యక్తిగత ఆహారం, నిద్ర అలవాట్లలో మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. స్థూలకాయుల్లో ఈ మార్పులు గణనీయంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. లాక్డౌన్ వల్ల ఇంటివద్దే ఉండడంతో ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే, ఎక్కువ తినడం, తక్కువ వ్యాయామం చేయడంతో పాటు నాణ్యమైన నిద్రలో మార్పులు వచ్చాయని గమనించారు. వీటికి తోడు ఆందోళన స్థాయిలు కూడా రెట్టింపు అయినట్లు అధ్యయనంలో పాల్గొన్న లియన్నే రెడ్మ్యాన్ వెల్లడించారు. సర్వేలో పాల్గొన్న మూడులో ఒకటో వంతు స్థూలకాయులు లాక్డౌన్ కాలంలో మరింత బరువు పెరిగారని.. మిగతా ప్రజల్లో కేవలం ఇరవై శాతం మంది మాత్రమే బరువు పెరిగినట్లు తెలిపారు. స్థూలకాయుల్లో శరీరక ఆరోగ్యం కంటే మానసికంగానే ఎక్కువ ప్రభావం చూపినట్లు పరిశోధనలో గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో స్థూలకాయుల ఆరోగ్యం విషయంలో డాక్టర్లు మరింత శ్రద్ధ చూపాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా లాక్డౌన్ కాలం పరిస్థితులను పరిగణలోకి తీసుకొని వారి మానసిక ఆరోగ్యాన్ని కూడా అంచనా వేయాల్సి ఉంటుందని సలహా ఇస్తున్నారు. వర్చువల్ పద్ధతిలో రోగులకు అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని వైద్యులకు సూచిస్తున్నారు. ఏప్రిల్ నెలలో జరిపిన ఈ సర్వేలో 7754 మంది పాల్గొన్నారు. వీరిలో ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకేతో పాటు మరికొన్ని దేశాల ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నట్లు తాజా నివేదికలో వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్