న్యూ ఇయర్‌ వేడుకలకు అనుమతి లేదు:సజ్జనార్‌

నగరంలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతిలేదని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. పబ్‌లు, బార్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని

Published : 26 Dec 2020 02:29 IST

హైదరాబాద్‌: నగరంలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతిలేదని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. పబ్‌లు, బార్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని.. వాటిని మరింత విస్తృతం చేస్తామన్నారు. గేటెడ్‌ కమ్యూనిటీల్లోనూ కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించవద్దని చెప్పారు. 

వేడుకలు నిర్వహిస్తున్నామంటూ నిర్వాహకులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని.. పాస్‌లు, టికెట్‌ విక్రయిస్తే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. హోటళ్లలోనూ వేడుకలకు అనుమతి లేదన్నారు. తమ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని సజ్జనార్‌ స్పష్టం చేశారు. టికెట్లు విక్రయిస్తున్నట్లు ఎవరైనా చెబితే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఇవీ చదవండి..

డిసెంబరు 31.. గుర్తుంది కదా...

ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నాం: జగన్‌

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని