ఏపీకి 302.. తెలంగాణకు 199మంది డీఎస్పీలు

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు పోలీసు అధికారుల తుది కేటాయింపు చేసింది. ఏపీ, తెలంగాణకు నాన్‌ ...

Published : 29 Oct 2020 01:52 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు పోలీసు అధికారుల తుది కేటాయింపు చేసింది. ఏపీ, తెలంగాణకు నాన్‌ కేడర్‌ ఎస్పీ, అదనపు ఎస్పీ, డీఎస్పీలను కేటాయించింది. 52:48 నిష్పత్తిలో కేంద్రం ఈ కేటాయింపులు జరిపింది. 

ఏపీకి 16 మంది నాన్‌ కేడర్‌ ఎస్పీలు, 64 మంది అదనపు ఎస్పీలు, 302 మంది డీఎస్పీలు.. తెలంగాణకు 9 మంది నాన్‌కేడర్‌ ఎస్పీలు, 49 మంది అదనపు ఎస్పీలు, 192 మంది డీఎస్పీలను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని