గుంటూరు జిల్లా ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేసిన కేంద్రం

గుంటూరు జిల్లా ఆస్పత్రిని కేంద్ర ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది. దీంతో పాటు అక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ విజ్ఞప్తి మేరకు ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేసినట్లు...

Published : 20 Sep 2020 18:45 IST

దిల్లీ: గుంటూరు జిల్లా ఆస్పత్రిని కేంద్ర ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది. దీంతో పాటు అక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ విజ్ఞప్తి మేరకు ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంపీ గల్లా జయదేవ్‌కు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ దిల్లీలో ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి గల్లా జయదేవ్‌ ధన్యవాదాలు తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని