వారి త్యాగాలు వెలకట్టలేనివి: చంద్రబాబు
కరోనా వ్యాప్తి నియంత్రణలో ఫ్రంట్లైన్ వారియర్స్ త్యాగాలు, సేవలు వెలకట్టలేనివని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు.
అమరావతి: కరోనా వ్యాప్తి నియంత్రణలో ఫ్రంట్లైన్ వారియర్స్ త్యాగాలు, సేవలు వెలకట్టలేనివని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. కరోనా మహమ్మారిపై అందరికీ అవగాహన అవసరమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ వైద్యులతో చంద్రబాబు వర్చువల్ సమావేశం నిర్వహించారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అధ్యయనాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపుతున్నానని చెప్పారు. కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ను కాపాడుకోవాలన్నారు.
‘‘ గత 2 వారాల్లో ఏపీలో కరోనా వృద్ధి రేటు అత్యధికంగా ఉంది. మరణాల్లోనూ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ప్రజలను అప్రమత్తం చేయడం తప్ప ప్రస్తుతానికి మందులు లేవు. డిజిటల్ సోషలైజేషన్, భౌతిక దూరం రెండూ ముఖ్యమే. ఎక్కువ మందిని ఒకే అంబులెన్స్లో తీసుకొస్తున్నారు. దీనివల్ల పాజిటివ్ లేనివారికి కూడా వచ్చే అవకాశముంది. అంబులెన్స్లు, ఆస్పత్రుల్లోనూ శానిటైజేషన్ ఎంతో ముఖ్యం’’ అని చంద్రబాబు అన్నారు.
క్వారంటైన్ కేంద్రాల్లో తగిన వసతులు ఉంటే రోగులు భయపడకుండా ఉంటారని చంద్రబాబు అన్నారు. కరోనా మృతులకు తగిన రీతిలో అంతిమ సంస్కారాలు జరగకపోవడం బాధాకరమని తెలిపారు. ప్రజలకు వేరే అత్యవసరమేది ఉన్నా.. కరోనా పరీక్ష చేయకుండా వైద్యం అందించట్లేదని చంద్రబాబు పేర్కొన్నారు. కరోనా పరీక్షల ఫలితాల కోసం రోగులు వేచి చూడాల్సి రావడం తగదన్నారు. సమాజాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత