అచ్చెన్న త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు

మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కరోనా సోకడంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు.

Published : 13 Aug 2020 21:14 IST

అమరావతి: మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కరోనా సోకడంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. అచ్చెన్నకు కరోనా సోకిందని తెలిసి బాధపడుతున్నానన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్‌ చేశారు. కరోనా నుంచి అచ్చెన్నాయుడు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్టు పేర్కొన్నారు. 

అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన తరఫు న్యాయవాది వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన గుంటూరులోని రమేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నను పోలీసులు అరెస్టుచేశారు. అనారోగ్యం కారణంగా ఆయన గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని