ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రేపు జరగాల్సిన వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు.

Published : 12 Oct 2020 01:22 IST

వెల్లడించిన ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిత్తల్ 

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రేపు జరగాల్సిన వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ఇంజినీరింగ్‌లో కొత్త కోర్సులు, కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జరగాల్సిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను నాలుగు రోజులకు కుదించి ఈ నెల 18 నుంచి 22వ తేదీల మధ్య చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను ఈ నెల 22వ తేదీన కేటాయించాలని గతంలో నిర్ణయించినప్పటికీ తాజా మార్పుల నేపథ్యంలో ఈ నెల 24న కేటాయించనున్నట్లు వివరించారు.

రేపటినుంచి మొదలు కానున్న ధ్రువపత్రాల పరిశీలన మాత్రం యథాతథంగా ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగునున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 36 సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన జరగనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఇప్పటి వరకు 35,824 మంది స్లాట్ బుక్ చేసుకున్నట్లు వివరించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9 వేల మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకానున్నట్లు కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని