రాష్ట్రంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. చర్చిలన్నీ రంగురంగుల విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అర్ధరాత్రి నుంచే క్రీస్తు ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు....
అర్ధరాత్రి నుంచే మొదలైన సంబరాలు
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. చర్చిలన్నీ రంగురంగుల విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అర్ధరాత్రి నుంచే క్రీస్తు ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దేవదూతగా శాంతాక్లాజ్ బహుమతులు ఇచ్చి ఆశీర్వచనాలు అందజేస్తున్నారు. పర్వదినం సందర్భంగా విజయవాడలోని రాజ్భవన్ను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. క్రీస్తు జననాన్ని తెలియజేసేలా చర్చిల్లో బొమ్మలు ఏర్పాటు చేశారు. గుణదల మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, క్రీస్తు గీతాలను ఆలపించారు. కృష్ణా జిల్లా నందిగామలో ప్రార్థనల కోసం మందిరం ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కోటగిరి లంకలో ఆర్సీఎం చర్చిలో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ స్టార్ ఆకర్షణగా నిలిచింది. అన్ని వర్గాల ప్రజలు ఏసుక్రీస్తును ప్రార్థించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. నెల్లూరు జిల్లా సుబేదారిపేటలో నిర్వహించిన ప్రార్థనల్లో మంత్రి అనిల్కుమార్ యాదవ్ పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల మందిరాలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రకాశం జిల్లాలో క్రిస్మస్ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. కలెక్టర్ పోలా భాస్కర్ కేకు కోసి భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. చీరాల, వేటపాలెం, పరుచూరు ప్రాంతాల్లో క్రిస్మస్ సందడి నెలకొంది.
ఇవీ చదవండి...
విభిన్నం.. ఈ క్రిస్మస్ చెట్టు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్