హాస్యనటి దంపతులకు బెయిల్ మంజూరు
మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన హిందీ హాస్యనటి భారతిసింగ్, హర్ష్ లింబాచియ్యా దంపతులకు ముంబయిలోని మెట్రోపాలిటన్ కోర్టు బెయిల్ మంజూరుచేసింది...
డ్రగ్స్ కేసులో అరెస్టయిన భారతిసింగ్ దంపతులకు ఊరట
ముంబయి: మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన హిందీ హాస్యనటి భారతిసింగ్, హర్ష్ లింబాచియ్యా దంపతులకు ముంబయిలోని మెట్రోపాలిటన్ కోర్టు బెయిల్ మంజూరుచేసింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదివారం కోర్టు ఆదేశించిన అనంతరం దంపతుల తరఫు న్యాయవాది ఆయాజ్ ఖాన్బెయిల్ బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. సోమవారం వారి బెయిల్ పిటిషన్ను పరిశీలించిన కోర్టు భార్యాభర్తలకు బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయాన్ని వారి న్యాయవాది వెల్లడించారు. ఒక్కొక్కరికీ రూ.15 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. వారి విడుదలపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఇంకా స్పందించలేదు.
నటుడు సుశాంత్సింగ్ రాజ్పూత్ మృతితో బాలీవుడ్లో మాదకద్రవ్యాల వినియోగం కలకలం రేపింది. ఎన్సీబీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. మరికొంతమందిని విచారించింది. అరెస్టయిన ఓ వ్యక్తి సమాచారం మేరకు ఎన్సీబీ అధికారులు శనివారం ఉదయం భారతిసింగ్, హర్ష్ ఇంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాగా వారింట్లో 86.5 గ్రాముల గంజాయి లభించడంతో దర్యాప్తు సంస్థ భార్యాభర్తలకు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరవ్వగా సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం డ్రగ్స్ తీసుకున్నట్లు బారతిసింగ్తోపాటు హర్ష్ లింబాచియ్యా ఒప్పుకున్నారు. దీంతో వారిని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం భార్యాభర్తలను ముంబయి కోర్టు ముందు హాజరుపరచగా వారికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అనంతరం వారి తరఫు న్యాయవాది బెయిల్కు దరఖాస్తు చేయగా ప్రత్యక న్యాయస్థానం సోమవారం వారిని బెయిల్పై విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?