ఉదయం కల్యాణం.. మధ్యాహ్నం కరోనా!
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరంలో వరుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరంలో వరుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పెళ్లయిన గంటల వ్యవధిలోనే ఈ వార్త తెలియడంతో బంధువులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పెళ్లికి హాజరైన వారికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దలు నిర్ణయించిన ప్రకారం గురువారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లా గూడురుకు చెందిన ఓ యువతితో వరుడి సొంత ఇంట్లో వివాహం జరిగింది. కొవిడ్-19 నిబంధనల ప్రకారం పెళ్లి చేసుకునేందుకు మూడు రోజుల ముందు మండల అధికారులకు దరఖాస్తు చేశారు.
కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించడంతో కడపలో నమూనాలు సేకరించారు. గురువారం తెల్లవారు జామున వివాహ అనంతరం వధువు, వరుడు గూడురుకు బయలుదేరారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం నమూనాలు ఇవ్వగా మధ్యాహ్నం 2 గంటలకు వరుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి ఎం.కవిత తెలిపారు. దీంతో ఈ సమాచారం అందుకున్న పోలీసులు అత్తగారి ఇంట్లో ఉన్న పెళ్లికొడుకొని కడపలోని కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. దీంతో పెళ్లికి హాజరైన బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. వివాహనికి ఏ ప్రాంతం నుంచి ఎంత మంది హాజరయ్యారని పోలీసులు, వైద్య సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 46 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీరికి కూడా పరీక్షలు నిర్వహించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో మిస్టరీ డెత్ను ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్