గాలి ద్వారానూ కరోనా వ్యాప్తి!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. దీనికి వ్యాక్సిన్ను కనుకగొనేందుకు పలు కంపెనీలు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మరోవైపు ఈ వైరస్ ఎలా వ్యాపిస్తోందన్న దానిపై స్పష్టత లేదు. మరీ ముఖ్యంగా ఈ మహమ్మారి గాలి ద్వారా వ్యాపిస్తుందా?లేదా? అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం దొరకడం లేదు...
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. దీనికి వ్యాక్సిన్ను కనుగొనేందుకు పలు కంపెనీలు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మరోవైపు ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతోందన్నదానిపై స్పష్టత లేదు. మరీ ముఖ్యంగా ఈ మహమ్మారి గాలి ద్వారా వ్యాపిస్తుందా?లేదా? అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందగలదని స్పష్టమైంది. అయితే ఈ విషయాన్ని సీడీసీ గతంలోనూ చెప్పింది. తన అధికారిక వెబ్సైట్లో సమాచారాన్ని పెట్టి మళ్లీ తొలగించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సమాచారాన్ని తొలగించినట్లు చెప్పిన సీడీసీ తాజాగా మరోసారి గాలిద్వారా వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని నిర్ధారించింది. ఈ మేరకు అక్కడి ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
కరోనా సోకిన వ్యక్తి దగ్గినపుడు, తుమ్మినపుడు వెలువడిన తుంపర్లలో వైరస్ ఉంటుందని, అది గాలి ద్వారా ప్రయాణించి వేరొకరికి సోకే అవకాశముంటుందని సీడీసీ వెల్లడించింది. అయితే సాధారణంగా తుంపర్లు కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత పేలిపోయి, వైరస్ నేలపై పడిపోతుంది. అలాంటప్పుడు 6 అడుగుల దూరం లోపల ఉన్న వారికి వైరస్ సోకే అవకాశముంటుంది. మరోవైపు గాలి, వెలుతురు సక్రమంగా ప్రసరించని చోట్ల తుంపర్ల ద్వారా కనీసం 2 మీటర్ల కంటే ఎక్కువ దూరం వైరస్ ప్రయాణించగలదని సీడీసీ వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో 6 అడుగుల కంటే ఎక్కువ దూరం ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందని తేల్చింది.
అయితే వైరస్ గాలిలో ఎంతసేపు బతికుంటుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీని వ్యవధి కొన్ని సెకెన్ల నుంచి గంటల వరకు ఉండొచ్చని సీడీసీ అభిప్రాయపడింది. గాలి వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు తుంపర్లు తొందరగా పేలిపోవడం గానీ, ఆవిరవడం కానీ జరుగుతుంది. దీనివల్ల వైరస్ తొందరగా నశించిపోయి వ్యాప్తి తీవ్రత తగ్గుతుందని సీడీసీ తెలిపింది. మనం తిరిగే చోట్ల గాలి వెలుతురు సక్రమంగా ప్రసరించేలా జాగ్రత్త పడాలని సూచించింది. వైరస్ సోకిన వ్యక్తులు తుమ్మినపుడు, దగ్గినపుడు వేలకొద్దీ తుంపర్లు వెలువడతాయని.. అందువల్ల కనీసం 6 అడుగుల దూరం పాటిస్తూ.. మాస్కులు, శానిటైజర్లు వాడాలని అక్కడి ప్రజలకు సీడీసీ సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?