వధువుకు కరోనా.. ఏం చేశారంటే..

కరోనా మహమ్మారి అన్నింటిపైనా ప్రభావం చూపిస్తోంది. కొవిడ్‌తో పెళ్లి తతంగం రూపురేఖలే మారిపోయాయి. మరికొద్ది గంటల్లో వివాహం ఉందనగా వధువుకు పాజిటివ్‌గా తేలడంతో...

Updated : 07 Dec 2020 12:09 IST

జైపుర్‌: కరోనా మహమ్మారి అన్నింటిపైనా ప్రభావం చూపిస్తోంది. కొవిడ్‌తో పెళ్లి తతంగం రూపురేఖలే మారిపోయాయి. మరికొద్ది గంటల్లో వివాహం ఉందనగా వధువుకు పాజిటివ్‌గా తేలడంతో పీపీఈ కిట్లు ధరించే పెళ్లి తంతును ముగించేశారు. వధూవరులతో పాటు మరో ముగ్గురు మాత్రమే ఈ వివాహంలో పాల్గొనడం గమనార్హం.

రాజస్థాన్‌లోని షాహాబాద్‌ జిల్లాకు చెందిన యువతికి డిసెంబర్‌ 6న పెళ్లి నిశ్చయమైంది. అయితే వివాహానికి కొద్ది గంటల ముందు వధువుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే పెద్దలు పెళ్లిని వాయిదా వేయాలనుకోలేదు. పురోహితుడు మంత్రాలు చదువుతుండగా పీపీఈ కిట్లు ధరించిన వధూవరులు దండలు మార్చుకొని ఒక్కటయ్యారు. పురోహితుడితోపాటు పెళ్లికి హాజరైన ఇంటి పెద్దలు కూడా పీపీఈ కిట్లు ధరించి పెళ్లి తంతుని కానిచ్చేశారు.

ఇవీ చదవండి..

4లక్షల దిగువకు క్రియాశీల కేసులు

ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు అనుమతి ఇవ్వండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని