టిప్పు రూ.3.68 లక్షలు..బిల్లు ఎంతో తెలుసా!
సరదాగా హోటల్కి వెళ్లి తిన్న తర్వాత వెయిటర్కి టిప్పు ఇవ్వాలంటే మనం కాస్త ఆలోచిస్తాం. ఒకవేళ ఇచ్చినా ఓ యాభై రూపాయల్లోపే ఉంటుంది. కొందరు ఇంకాస్త ఎక్కువ మొత్తాన్నే టిప్పుగా ఇస్తుంటారు.
వాషింగ్టన్: సరదాగా హోటల్కి వెళ్లి తిన్న తర్వాత వెయిటర్కి టిప్పు ఇవ్వాలంటే మనం కాస్త ఆలోచిస్తాం. ఒకవేళ ఇచ్చినా ఓ యాభై రూపాయల్లోపే ఉంటుంది. కొందరు ఇంకాస్త ఎక్కువ మొత్తాన్నే టిప్పుగా ఇస్తుంటారు. అలాంటి వాళ్లు ఒక్కరు దొరికినా ఆ రోజు వెయిటర్ల పంట పండినట్లే. తాజాగా.. అమెరికాలో ఓ మిత్రబృందం వెయిటర్కు ఏకంగా 5 వేల డాలర్లు (దాదాపు రూ. 3 లక్షల 68 వేలు) టిప్పుగా ఇచ్చారు. ఇంతకీ వారు తిన్న ఆహారానికి అయింది కేవలం 205 డాలర్లు (రూ.15 వేలు) మాత్రమే.
పెన్సిల్వేనియాలోని ఓ రెస్టారెంట్లో జియానా డి ఏంజెలో అనే యువతి వెయిటర్గా పనిచేస్తోంది. ఈక్రమంలో ఓ మిత్ర బృందం రెస్టారెంట్కు వచ్చి, ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నారు. ఇంతలో జియానా బిల్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్లింది. మళ్లీ వచ్చి చూసే సరికి బిల్లుతోపాటు 5 వేల డాలర్లు అదనంగా కనిపించాయి. ఒకవేళ వారు మర్చిపోయారేమో అని వారి కోసం చూసింది. కానీ వారు అప్పటికే వెళ్లిపోయారు. వారు ఆ డబ్బుని టిప్పుగా ఇచ్చారని అర్థమైంది. ఈవిషయం తన యజమానికి చెప్పగా.. యజమాని ధన్యవాదాలు చెబుతూ.. బిల్ పేపర్ను ఫేస్బుక్లో షేర్ చేశారు. ఇంత మొత్తంలో టిప్పు అందుకున్న జియానా ఆనందానికి హద్దుల్లేవు. ఆ డబ్బు సొంత ఖర్చులకు వాడను. ఏదైనా మంచి పనికోసం వినియోగిస్తాను అని జియానా తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది.
ఇదీ చదవండీ..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..