టిప్పు రూ.3.68 లక్షలు..బిల్లు ఎంతో తెలుసా!

సరదాగా హోటల్‌కి వెళ్లి తిన్న తర్వాత వెయిటర్‌కి టిప్పు ఇవ్వాలంటే మనం కాస్త ఆలోచిస్తాం. ఒకవేళ ఇచ్చినా ఓ యాభై రూపాయల్లోపే ఉంటుంది. కొందరు ఇంకాస్త ఎక్కువ మొత్తాన్నే టిప్పుగా ఇస్తుంటారు.

Updated : 19 Dec 2020 00:23 IST

వాషింగ్టన్‌: సరదాగా హోటల్‌కి వెళ్లి తిన్న తర్వాత వెయిటర్‌కి టిప్పు ఇవ్వాలంటే మనం కాస్త ఆలోచిస్తాం. ఒకవేళ ఇచ్చినా ఓ యాభై రూపాయల్లోపే ఉంటుంది. కొందరు ఇంకాస్త ఎక్కువ మొత్తాన్నే టిప్పుగా ఇస్తుంటారు. అలాంటి వాళ్లు ఒక్కరు దొరికినా ఆ రోజు వెయిటర్ల పంట పండినట్లే. తాజాగా.. అమెరికాలో ఓ మిత్రబృందం వెయిటర్‌కు ఏకంగా 5 వేల డాలర్లు (దాదాపు రూ. 3 లక్షల 68 వేలు) టిప్పుగా ఇచ్చారు. ఇంతకీ వారు తిన్న ఆహారానికి అయింది కేవలం 205 డాలర్లు (రూ.15 వేలు) మాత్రమే. 
 

పెన్సిల్వేనియాలోని ఓ రెస్టారెంట్‌లో జియానా డి ఏంజెలో అనే యువతి వెయిటర్‌గా పనిచేస్తోంది. ఈక్రమంలో ఓ మిత్ర బృందం రెస్టారెంట్‌కు వచ్చి, ఫుడ్‌ ఆర్డర్‌ చేసి తిన్నారు. ఇంతలో జియానా బిల్లు తీసుకొచ్చి టేబుల్‌ మీద పెట్టి వెళ్లింది. మళ్లీ వచ్చి చూసే సరికి బిల్లుతోపాటు 5 వేల డాలర్లు అదనంగా కనిపించాయి. ఒకవేళ వారు మర్చిపోయారేమో అని  వారి కోసం చూసింది. కానీ వారు అప్పటికే వెళ్లిపోయారు. వారు ఆ డబ్బుని టిప్పుగా ఇచ్చారని అర్థమైంది. ఈవిషయం తన యజమానికి చెప్పగా.. యజమాని ధన్యవాదాలు చెబుతూ.. బిల్‌ పేపర్‌ను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. ఇంత మొత్తంలో టిప్పు అందుకున్న జియానా ఆనందానికి హద్దుల్లేవు. ఆ డబ్బు సొంత ఖర్చులకు వాడను. ఏదైనా మంచి పనికోసం వినియోగిస్తాను అని జియానా తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది.

ఇదీ చదవండీ..

తుమ్ము ఆపుకొంటున్నారా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని