తిరుమలలో వైభవంగా దీపావళి ఆస్థానం

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. ..

Updated : 14 Nov 2020 11:16 IST

తిరుమల: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. ఏటా ఆశ్వీయుజ మాసం అమావాస్య రోజున శ్రీవారికి సుప్రభాతం నుంచి మొదటిగంట నివేదన వరకూ కైంకర్యాలను యథావిధిగా జరిపి అనంతరం బంగారువాకిలి ముందున్న ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహించటం సంప్రదాయంగా వస్తోంది. ఆస్థానంలో భాగంగా ఉభయదేవేరులతో మలయప్పస్వామిని సర్వభూపాల వాహనంపై ఘంటా మండపంలో వేంచేపు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతి, ప్రసాద నివేదలను ఆగమోక్తంగా నిర్వహించారు.

సాయంత్రం 5గంటల నుంచి 7గంటల వరకు శ్రీదేవి భూదేవీ సమేత శ్రీమలయప్పస్వామి సహస్రదీపాలంకరణ సేవలో పాల్గొని నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. దీపావళి ఆస్థానాన్ని పురస్కరించుకొని కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, అర్జిత సేవలను తితిదే రద్దు చేసింది. మరోవైపు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి మానవాళిని కాపాడేలా చూడాలని స్వామివారిని కోరుకున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని