దిల్లీలోని పరిశ్రమలు సహజవాయువునే వాడాలి
దేశరాజధాని ప్రాంతంలోని పరిశ్రమలన్నీ 2021 జనవరి 31 నాటికి పూర్తిస్థాయిలో సహజవాయువునే వినియోగించాలని వాయునాణ్యతా నిర్వహణ కమిషన్ మంగళవారం ఆదేశించింది.
దిల్లీ: దేశరాజధాని ప్రాంతంలోని పరిశ్రమలన్నీ 2021 జనవరి 31 నాటికి పూర్తిస్థాయిలో సహజవాయువునే వినియోగించాలని వాయునాణ్యతా నిర్వహణ కమిషన్ మంగళవారం ఆదేశించింది. దేశరాజధాని ప్రాంతంలోని కాలుష్యానికి పరిశ్రమలు ప్రధాన కారణం అని కమిషన్ పేర్కొంది. పైప్డ్ నేచురల్ గ్యాస్ను వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో వినియోగిస్తారు. ఇది కాలుష్య రహిత ఇంధనం. ఆర్థిక, రక్షణ పరంగా కూడా సురక్షితమైన ఇంధనం. నూతన సంవత్సరం నుంచి దిల్లీలోని పరిశ్రమలన్నీ పీఎనీజీ (పైప్డ్ నేచురల్ గ్యాస్)నే వాడాలని వారు ఆదేశించారు. దిల్లీలో ఉన్న పరిశ్రమలు పీఎన్జీకి మారడం వల్ల జరిగే మార్పులను ఈ కమిషన్ సమీక్షించింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు, గెయిల్, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్(ఐజీఎల్) ప్రతినిధులు హాజరయ్యారు.
దిల్లీ మాజీ ప్రధాన కార్యదర్శి ఎంఎం కుట్టి నేతృత్వంలోని కమిషన్ ఈ బాధ్యతను ఐజీఎల్ కంపెనీకి అప్పగించింది. జనవరి 31, 2021 నాటికి దిల్లీలో ఇప్పటికే గుర్తించిన అన్ని పరిశ్రమలకు పైపుల ద్వారా సహజవాయువు సరఫరా అందేలా చూడాలని ఐజీఎల్ను ఆదేశించింది. దిల్లీ కాలుష్య నివారణ కమిటీ (డీపీసీసీ) కూడా ఎప్పటికప్పుడు పరిశ్రమలను తనిఖీ చేయాలని సూచించింది. ఏవైనా పరిశ్రమలు నిషేధిత ఇంధనాలు వాడుతున్నట్లు నిరూపితమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ విధంగా మార్పుల చేయాల్సిన పరిశ్రమలు సుమారు 1,644 ఉన్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే చాలా పరిశ్రమలు సహజవాయువును వాడుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను వీలైనంత త్వరలో పూర్తి చేయాలని కమిషన్ ఆదేశించింది. దీనికి కావాల్సిన పైప్లైన్లు, మీటరింగ్, తదితర మౌలిక సదుపాయాలు ఐజీఎల్, గెయిల్ సమకూరుస్తాయని కమిషన్ వెల్లడించింది. ఐజీఎల్, గెయిల్, డీపీసీసీ, దిల్లీ ప్రభుత్వం సమన్వయంతో పనిచేసి అనుకున్న సమయానికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కమిషన్ సూచించింది. పరిశ్రమలు దిల్లీ కాలుష్యంలో ముఖ్యభూమిక పోషిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 20మంది సభ్యులతో కూడిన ఈ కమిషన్ను పర్యావరణ మంత్రిత్వశాఖ నవంబరులో ఏర్పాటు చేసింది. తీవ్ర వాయుకాలుష్యంతో శీతాకాలంలో దిల్లీ ఇబ్బందులు పడుతుండటంతో ఈ కమిషన్ను ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు