ఇకపై ఆన్లైన్లోనే డ్రైవింగ్ లైసెన్స్
ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు తెలంగాణ రవాణాశాఖ మరో 5 రకాల సేవలను ఆన్లైన్ పరిధిలోకి తెచ్చింది.
పువ్వాడ అజయ్
హైదరాబాద్: ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు తెలంగాణ రవాణాశాఖ మరిన్ని ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫెస్ట్ (ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ సర్వీస్ ఆఫ్ ట్రాన్స్పోర్టు) పేరిట ఖైరతాబాద్లోని రవాణాశాఖ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఈ సేవలను ప్రారంభించారు. వీటి ద్వారా 5 రకాల ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజల సమయం వృథా కాకుండా పారదర్శకత కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇకపై డూప్లికేట్ లెర్నింగ్ లైసెన్స్, బ్యాడ్జీలను అందజేయడం, డూప్లికేట్ లైసెన్స్, హిస్టరీ షీట్, పాతకార్డు స్థానంలో స్మార్ట్ కార్డులను ఇవ్వడం వంటి 5 రకాల సేవలను ఆన్లైన్ ద్వారా అందించనున్నారు. మరో ఆరు సేవల్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పని చేసే ఈ సేవలను మొబైల్లో పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అనేక సంస్కరణలు వచ్చాయని, మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా దేశంలోనే తొలిసారిగా రవాణాశాఖలో ఆన్లైన్ సేవలను ప్రారంభించడం గర్వంగా ఉందని అజయ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్