శంషాబాద్ విమానాశ్రయం అరుదైన ఘనత
అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఇ-బోర్డింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన మొట్టమొదటి విమానాశ్రయంగా ఆర్జీఐఏ ఘనత సాధించింది.
శంషాబాద్: అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఈ-బోర్డింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన మొట్టమొదటి విమానాశ్రయంగా ఆర్జీఐఏ ఘనత సాధించింది. ఆత్మనిర్భర్ స్ఫూర్తితో అంతర్గతంగా ఈ-బోర్డింగ్కు రూపకల్పన చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతర్జాతీయ ఈ-బోర్డింగ్ సదుపాయాన్ని పొందిన మొదటి ఎయిర్లైన్స్గా ఇండిగో గుర్తింపు పొందింది. భారత విమానయాన రంగంలోనే ఇదొక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ-బోర్డింగ్ సేవల ద్వారా అంతర్జాతీయ ప్రయాణికులకు మరింత భద్రత చేకూరనున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం ఈ-బోర్డింగ్ సేవలు ఇండిగో ఎయిర్ లైన్స్ ఎంపిక చేసిన అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ప్రయాణించే వారికి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయోగాత్మకంగా విజయవంతమై, ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాతే ఈ-బోర్డింగ్ సేవలను అంతర్జాతీయ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు చెప్పారు. ఈ నెల 2న ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన 6E1405 విమాన ప్రయాణికులు హైదరాబాద్ నుంచి షార్జాకు ఈ-బోర్డింగ్ సేవలను అందుకున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరే మిగతా అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమాన సర్వీసుల్లోనూ త్వరలోనే ఈ-బోర్డింగ్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జీహెచ్ఐఏఎల్ సీఈవో ప్రదీప్ ఫణికర్ వివరించారు. ఆర్జీఐఏ 2015 డిసెంబర్లో దేశీయ విమాన ప్రయాణికులకు ఈ-బోర్డింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. విమానాశ్రయం ప్రస్తుతం ప్రతి షెడ్యూల్డ్ దేశీయ కార్యకలాపాలకు ఈ-బోర్డింగ్ సదుపాయాన్ని అందిస్తోంది.
అంతర్జాతీయ ఈ-బోర్డింగ్ వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు
• ప్రయాణికులు విమానాశ్రయంలో వేచి ఉండే సమయం తగ్గుతుంది.
• ఒక అడ్వాన్స్డ్ సెక్యూరిటీ వ్యవస్థగా వివిధ సెక్యూరిటీ పాయింట్ల వద్ద మళ్లీ మళ్లీ తనిఖీ చేయాల్సిన అవసరం ఉండదు.
• వివిధ చెక్ పాయింట్ల వద్ద ప్రయాణికుల రియల్ టైమ్ డేటా అందుబాటులోకి రావడం ద్వారా సమయం ఆదా అవుతుంది.
• విమానాశ్రయం నిర్వహణ సామర్థ్యాలు, భద్రత పెరుగుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల