ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి అచ్చెన్నాయుడు తరలింపు

ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అనారోగ్యం కారణంగా ఇప్పటి వరకూ ఆయన రమేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇటీవల

Updated : 08 Dec 2022 16:29 IST

గుంటూరు: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అనారోగ్యం కారణంగా ఇప్పటి వరకూ ఆయన రమేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇటీవల అచ్చెన్నాయుడుకు కరోనా సోకడంతో కొవిడ్‌ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడి కరోనా వార్డులో 26వ గదిని అచ్చెన్నాయుడికి కేటాయించారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందించనున్నారు. అచ్చెన్నాయుడు ఉన్న గది వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని