బీరుట్ పేలుళ్ల బాధిత బాలికలకు బొమ్మలు
లెబనాన్ దేశానికి ఈ ఏడాది ఆగస్టు నాలుగో తేదీ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ దేశ రాజధాని బీరుట్లోని ఓ గోదాములో నిల్వ ఉంచిన రసాయన పదార్థాలు పేలి పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా ప్రాణాలు
బీరుట్: లెబనాన్ దేశానికి ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ దేశ రాజధాని బీరుట్లోని ఓ గోదాములో జరిగిన ప్రమాదంలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 4 వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ భయానక ఘటనలో వందల సంఖ్యలో భవనాలు కూలిపోయాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో లెబనాన్కు చెందిన ప్రముఖ కళాకారిణి, పెయింటర్ యొలందే లబకీ(93) అనే వృద్ధురాలు చిన్నారులపై తనకున్న ప్రేమను వ్యక్తపరచాలనుకున్నారు.
చిన్నపిల్లలంటే అమితమైన ఇష్టం ఉన్న ఆమె పేలుళ్ల సమయంలో ఆట వస్తువులను కోల్పోయిన బాలికల ముఖంపై చిరు నవ్వు చూడాలని నిర్ణయించుకున్నారు. తన స్వహస్తాలతో బొమ్మలను చేసి బాలికలకు ఇవ్వాలని పేలుళ్లు జరిగిన మరుసటి రోజు నుంచే వాటిని తయారు చేస్తున్నారు. ఆగస్టు నాలుగో తేదీ పేలుళ్లు సంభవించగా ఆ మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే బొమ్మలను తయారు చేయడం మొదలుపెట్టారు. 100 బొమ్మలను చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్న వృద్ధురాలు రెండు నెలల కాలంలో 73 బొమ్మలను తయారు చేశారు. మిగతా వాటిని పూర్తి చేసి అన్నింటిని కలిపి ఒకేసారి ఆమె చిన్నారులకు అందజేయనున్నారు.
ఎంతో అందంగా పిల్లలకు నచ్చేలా బొమ్మలను తయారు చేసిన వృద్ధురాలి గురించి తెలుసుకున్న స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఆమెను కలిశారు. ఆమె రూపొందించిన బొమ్మలను వాటితో ఉన్న వృద్ధురాలిని ఫొటోలు తీసి ఆమె మంచి మనసు గురించి వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో నెటిజన్లు ఆ వృద్ధ కళాకారిణిని మెచ్చుకుంటున్నారు. బొమ్మలతో ఉన్న కళాకారిణి ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు మార్గంలో భారీగా ట్రాఫిక్జామ్: వాహనాలు నిలిపి.. కి.మీ మేర నడిచి..
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే