ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్‌

మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈఎస్‌ఐ కేసులో అరెస్టయిన ఆయనకు ఇటీవల కరోనా సోకడంతో గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందారు...

Updated : 13 Sep 2023 16:56 IST

మంగళగిరి: మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈఎస్‌ఐ కేసులో అరెస్టయిన ఆయనకు ఇటీవల కరోనా సోకడంతో గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆదివారం ఆయనకు నిర్వహించిన పరీక్షలో కరోనా నెగటివ్‌ రావడంతో ఈరోజు వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. ఈఎస్‌ఐ కేసులో ఇప్పటికే అచ్చెన్నాయుడుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన అనంతరం అచ్చెన్నాయుడు నేరుగా శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మాడకు బయల్దేరి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని