మాస్క్లు అతిగా వాడితే ప్రమాదమా?
కరోనా కారణంగా మాస్క్లేనిదే బయటకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. మాస్క్లు అతిగా వాడటం వల్ల కలిగే ఇబ్బందులు
హూస్టన్: కరోనా కారణంగా మాస్క్లేనిదే బయటకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. మాస్క్లు అతిగా వాడటం వల్ల కలిగే ఇబ్బందులు ఇవేనంటూ కొన్ని వార్తలు సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొడుతున్నాయి. మాస్క్ల కారణంగా కార్బన్డయాక్సైడ్ స్థాయులు పెరిగి, ఊపిరితిత్తుల సమస్యకు దారితీస్తుందని ప్రచారం చేస్తున్నారు. తాజా అధ్యయనమొకటి ఈ వార్తలను ఖండించింది. మరీ ముఖ్యంగా మాస్క్ల వినియోగం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మియామీ ఈ విషయమై అధ్యయనం చేసింది.
మాస్క్లు ధరించడం వల్ల ఆరోగ్యవంతులైన వ్యక్తుల్లో ఆక్సిజన్, కార్బన్డయాక్సైడ్ స్థాయుల్లో మార్పులు జరిగి అనారోగ్యం పాలవుతారన్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. అయితే, అందరిలోనూ అలా జరగకపోవచ్చని ముఖ్యంగా క్రానిక్ అబ్స్ట్రాక్టివ్ పల్మనరీ డీసీజ్(సీఓపీడీ)తో బాధపడేవారిలో ఈ సమస్య ఎదురుకావొచ్చని ఈ అధ్యయనం పేర్కొంది. ఎందుకంటే సీఓపీడీ సమస్య ఉన్న వాళ్లు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ‘మాస్క్ ధరించడం వల్ల అతి తక్కువ మంది మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదీ కూడా తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికి ఇది ఇంకాస్త ఎక్కువగా ఉండవచ్చు’ అని అధ్యయన కర్తల్లో ఒకరైన మైఖేల్ కాంపోస్ తెలిపారు.
సౌకర్యవంతమైన, గాలి పీల్చుకునేందుకు వీలైన మాస్క్లు ధరించడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని, అయితే, మాస్క్లను బిగుతుగా ధరించడం, వేగంగా నడవడం వల్ల శ్వాస ఆడక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇతరులకు దూరంగా ఉన్నప్పుడు మాస్క్ను తొలగించవచ్చని కాంపోస్ చెప్పారు. అయితే, అదే సమయంలో కరోనాను అడ్డుకట్టవేయడంలో మాస్క్ ధరించడం తప్పనిసరి అని కూడా అన్నారు. సర్జికల్ మాస్క్లు ధరించలేని వారు రెండు పొరలతో కూడిన క్లాత్ మాస్క్ ధరించాలని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సూచించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి