రెండు నెలల్లో కరోనా టీకాలు వేయొచ్చేమో
అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 70 లక్షలకు చేరింది. రెండు లక్షలకు పైగా ప్రజలు ఈ వైరస్ ధాటికి బలయ్యారు. ఈ నేపథ్యంలో అమెరికాలో నవంబరు లేదా డిసెంబరు నాటికి టీకా వేసే ప్రక్రియ
యూఎస్ అంటువ్యాధుల నిపుణుడు ఫౌచీ
వాషింగ్టన్: అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 70 లక్షలకు చేరింది. రెండు లక్షలకు పైగా ప్రజలు ఈ వైరస్ ధాటికి బలయ్యారు. ఈ నేపథ్యంలో అమెరికాలో నవంబరు లేదా డిసెంబరు నాటికి టీకా వేసే ప్రక్రియ ప్రారంభం అవుతుందేమో అని యూఎస్ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ అన్నారు. స్థానిక ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. వ్యాక్సిన్ అనుమతికి సంబంధించి రాజకీయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయన్న ఆయన వచ్చే ఏప్రిల్ నాటికి రకరకాల కంపెనీలకు చెందిన 700 మిలియన్ల వ్యాక్సిన్ డోస్లు యూఎస్లో అందుబాటులో ఉంటాయన్నారు. అయితే వాటి సామర్థ్యంపై అనుమానం వ్యక్తం చేశారు. పరిమిత సమయానికి ఎక్కువ మందికి టీకాలు వేయటం ద్వారా వైరస్ను ధాటిగా ఎదుర్కోవటంలో మనం ప్రభావం చూపినట్లు అవుతుందని ఆయన వివరించారు.
దీంతో మనం కరోనా ముందు ఉన్నటువంటి సాధారణ పరిస్థితుల వైపు ఆలోచించవచ్చని ఫౌచీ తెలిపారు. తొలుత టీకా వేయించుకున్న వారు ఎలా ఉన్నారో తెలుసుకున్న తర్వాతే చాలా మంది ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోడానికి ముందుకొస్తారని ఆయన వివరించారు. అమెరికా వ్యాప్తంగా ఆగస్టు 31 నాటికి 6 మిలియన్లుగా ఉన్న బాధితులు 25 రోజుల్లోనే 7 మిలియన్లకు చేరారు. 8లక్షల కరోనా కేసులు దాటిన రాష్ర్టంగా కాలిఫోర్నియా తొలిస్థానంలో ఉండగా 7 లక్షల పై చిలుకు కేసులతో టెక్సాస్ రెండో స్థానంలో ఉన్నట్లు ఆయన వివరించారు. దీంతో గత వారం కంటే ప్రస్తుతం 9 శాతం కేసులు పెరిగినట్లు ఆయన వివరించారు. ప్రస్తుత శీతాకాల పరిస్థితుల్లో వైరస్ ఉద్ధృతిని కట్టడి చేయటం కష్టమని ఫౌచీ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే