బోట్హౌస్ను..అంబులెన్స్గా మార్చి..!
కరోనా వైరస్ కొంతమందికి కష్టాలను తీసుకువస్తే మరి కొంతమందిలో వినూత్న ఆలోచనలు రేకెత్తడానికి కారణమయ్యింది. కశ్మీర్లో బోట్ అంబులెన్స్ అందుబాటులోకి తేవాలన్న వినూత్న ఆలోచనా అలా వచ్చిందే. కరోనా వేళా..
ఇంటర్నెట్ డెస్క్ : కరోనా వైరస్ కొంతమందికి కష్టాలను తీసుకువస్తే మరి కొంతమందిలో వినూత్న ఆలోచనలు రేకెత్తడానికి దోహదం చేసింది. కశ్మీర్లో బోట్ అంబులెన్స్ అందుబాటులోకి తేవాలన్న వినూత్న ఆలోచనా అలా వచ్చిందే. కరోనా వేళా.. తనలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదని భావించిన ఓ హౌస్బోట్ యజమాని ఈ ఆలోచన చేశారు. దీనివల్ల ఎంతోమందికి ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రకాల సౌకర్యాలతో ధాల్ లేక్ ప్రాంతంలో ఉన్నవారికి ఈ అంబులెన్స్ సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. మరి సంగతులేంటో మీరు తెలుసుకోండి.
ధాల్ సరస్సుకు చెందిన ఓ హౌస్బోట్ యజమాని తారీక్ అహ్మద్ గతంలో కరోనా బారినపడ్డారు. ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆసుప్రతికి వెళ్లే విషయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందే .. అక్కడ ఉన్న ప్రజలను ఎంతోకాలంగా వేధిస్తోందని గుర్తించారు. ఇకపై ఇంకెవరికీ ఆ పరిస్థితి రాకూడదని భావించారు. అంతే.. తనకు ఉన్న హౌస్బోట్ను అంబులెన్స్గా మార్చేశారు.
ధాల్ సరస్సు ప్రాంతంలో ఉండే ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పిన అహ్మద్... అత్యవసర సమయంలో వైద్య సేవలు అందక ఎంతోమంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా ఉండేందుకే బోటు అంబులెన్స్కు శ్రీకారం చుట్టానని వివరించారు. అత్యవసర సమయంలో కావల్సిన వసతులను కలిగిన ఈ బోట్ అంబులెన్స్ 35 అడుగుల పొడవు ఉంటుంది. ఆక్సిజన్ సిలిండర్, ఈసీజీ వంటివి ఇందులో ఉంటాయని, దీని సేవలకోసం తనను సంప్రదించడానికి టోల్ ఫ్రీ నంబర్ను కూడా అంబులెన్స్పై రాయిస్తానని చెప్పుకొచ్చారు అహ్మద్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్