వేలానికి 7801 వజ్రాల ఉంగరం
7801 వజ్రాలు పొదగబడి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన బ్రహ్మకమలం వజ్రాన్ని వేలానికి ఉంచనున్నారు. అత్యధిక వజ్రాలు పొదిగి గిన్నిస్ బుక్లోనూ చోటు సంపాదించుకున్న ఈ ఉంగరాన్ని...
రిజర్వ్ ధర రూ.78,01,000గా నిర్ణయం
ముంబయి: 7801 వజ్రాలు పొదగబడి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన బ్రహ్మకమలం వజ్రాన్ని వేలానికి ఉంచనున్నారు. అత్యధిక వజ్రాలు పొదిగి గిన్నిస్ బుక్లోనూ చోటు సంపాదించుకున్న ఈ ఉంగరాన్ని నవంబర్ 13 నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో వేలం వేయనున్నారు. 2వ తేదీనుంచి వేలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. www.thedivine7801.com వెబ్సైట్లో నిర్వాహకులు ఈ వేలాన్ని నిర్వహించనున్నారు. ఉంగరం రిజర్వ్ ధరను రూ.78,01,000గా నిర్ణయించారు.
హైదరాబాద్కు చెందిన ‘ది డైమండ్ స్టోర్ బై చుందూబాయి’ నిర్వాహకులు చందూబాయి కుమారుడు కొట్టి శ్రీకాంత్ ఈ ఉంగరాన్ని రూపొందించారు. కమలం రేకులు విచ్చుకున్నట్లు ఉండే ఈ కళాఖండం తయారీకి 11 నెలల సమయం పట్టిందని శ్రీకాంత్ తెలిపారు. దానికి ‘ది డివైన్-7801 బ్రహ్మ వజ్ర కమలం’గా పేరు పెట్టారు.
‘నా కళను గుర్తించి నేను రూపొందించిన ఉంగరానికి గిన్నిస్ బుక్లో చోటు కల్పించిన అధికారులకు ధన్యవాదాలు. ఈ విజయాన్ని మీతో పంచుకుంటున్నందుకు గర్విస్తున్నాను. 7801 వజ్రాలతో రూపొందించిన ఉంగరాన్ని ఆన్లైన్లో విక్రయించేందుకు నిర్ణయించాం. ఉంగరాన్ని విక్రయించగా వచ్చిన ఆదాయంలో 10 శాతాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి ఇవ్వనున్నట్లు తెలిపేందుకు సంతోషిస్తున్నా’ అని శ్రీకాంత్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా