ఆ వదంతులు నమ్మొద్దు: మెట్రో ఎండీ

నగరంలోని మెట్రో పిల్లర్లపై వస్తున్న వదంతులను నమ్మవద్దని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూసాపేట మెట్రో స్టేషన్‌ కింద రహదారి..

Published : 15 Oct 2020 01:10 IST

హైదరాబాద్‌: నగరంలోని మెట్రో పిల్లర్లపై వస్తున్న వదంతులను నమ్మవద్దని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూసాపేట మెట్రో స్టేషన్‌ కింద రహదారి కుంగిపోయింది. పక్కనే ఉన్న మెట్రో పిల్లర్‌ వద్ద కూడా భూమి కుంగి ఆ గుంతల్లోకి నీరు చేరింది. ఈ నేపథ్యంలో ఎన్వీఎస్‌ రెడ్డి స్పందించారు. కూకట్‌పల్లి ఐడీఎల్‌ చెరువుతో పాటు రోడ్లపై ప్రవహిస్తు్న్న వరదనీటితో మెట్రో పిల్లర్‌ చుట్టూ ఉన్న మట్టి కొట్టుకుపోయిందన్నారు. ఇంజినీర్లు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి వదంతులు నమ్మవద్దని.. మెట్రో పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని