చలికాలంలో జుట్టు రాలుతోందా?
తల వెంట్రుకలు రాలిపోతుంటే ఎంతో ఇబ్బందికరంగా అనిపిస్తుంది. జుట్టు సంరక్షణ కోసం ఎంతోమంది రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో.. జట్టుకు చాలా సమస్యలే వస్తాయి. పొడిబారటం, కాంతిహీనంగా మారటం
ఇంటర్నెట్ డెస్క్ : తల వెంట్రుకలు రాలిపోతుంటే ఎంతో ఇబ్బందికరంగా అనిపిస్తుంది. జుట్టు సంరక్షణ కోసం ఎంతోమంది రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో.. జట్టుకు చాలా సమస్యలే వస్తాయి. పొడిబారటం, కాంతిహీనంగా మారటం వంటి వాటితో పాటు కొసలు చిట్లీ గుర్రపు వెంట్రుకలను తలపిస్తాయి. మరి సీజన్ మార్పులకు తగట్టుగా జుట్టు సంరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటీ? ఆయుర్వేదం చూపిస్తున్న పరిష్కారాలు ఏమిటీ? ఆ వివరాలు మీకోసమే...
చలికాలంలో జుట్టు రాలటం అరికట్టటానికి ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాలను చూపిస్తోంది. కోడిగుడ్డు, పెరుగు, అరటిపండు, ఆలివ్ నూనె, నిమ్మరసాల మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలంటోంది. ఇలా చేయటం వల్ల మంచి ఫలితం కనిపిస్తుందని చెబుతోంది.
మిశ్రమం తయారీ ఇలా...
రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో ఒక గుడ్డు పగులగొట్టి వేయాలి. దీనికి సగం అరటి పండు కలపాలి. ఆలివ్ నూనె, నిమ్మరసాలను ఒక్కో టీస్పూన్ చొప్పున జోడించాలి. వాటితో పాటు విటమిన్ ఈ క్యాప్సుల్ కూడా కలపాలి. ఈ మొత్తాన్ని బాగా కలియతిప్పి మిశ్రమం తయారు చేయాలి. తలస్నానం చేసిన తరువాత జుట్టు కుదుళ్ల వరకు ఈ మిశ్రమాన్ని పట్టించాలి. పదిహేను నుంచి ఇరవై నిమిషాల తరువాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. అనేక పోషకాలు కలిగిన కోడిగుడ్డు కుదుళ్లకు బలాన్ని చేకూరుస్తుంది. పెరుగు వెంట్రుకల మూలాల దగ్గర నుంచీ పూర్తిగా శుభ్ర పరుస్తుంది. అరటి, ఆలివ్ నూనెలు పొడి బారిన జుట్టుకు జీవాన్ని తీసుకువస్తాయి. నిమ్మరసం వెంట్రుకలకు మెరుపు తెస్తుంది.
పొడిజుట్టు ఉన్నప్పుడు తలస్నానానికి ముందు నూనె పెట్టుకోవాలి. జింక్, బయోటిన్ వంటి పొషకాలున్న ఆహారాన్ని విరివిగా తీసుకోవాలి. తలను పదే పదే దువ్వటం, హెయిర్ డ్రైయ్యర్ను వాడటం వెంట్రుకలకు మేలు చేయదు. ఒత్తిళ్లు, ఆందోళనలు సాధ్యమయినంత వరకు తగ్గించుకోవాలి. చుండ్రు, పేను కొరుకుడు వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలి. ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో జుట్టు రాలటాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
చంద్రబాబుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు