హరీశ్‌రావుకు కరోనా నెగెటివ్‌

ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కోలుకున్నారు. తాజాగా ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయింది.

Published : 12 Sep 2020 16:33 IST

హైదరాబాద్‌: ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కోలుకున్నారు. తాజాగా ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు ఉండటంతో ఆయన పరీక్షలు చేయించుకోగా.. ఈ నెల 5న పాజిటివ్‌గా తేలినట్టు ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, తన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు ఆయన తెలిపారు. అప్పటినుంచి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న హరీశ్‌రావు కోలుకున్నారు. శాసనసభ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ త్వరలోనే ఆయన హాజరు కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని