బాలుడి వేగానికి ఆనంద్ మహీంద్రా ఫిదా
విదేశాలకు చెందిన ఓ బుడతడి వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ అతడి వేగాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ బాలుడిని యంత్రంతో పోల్చారు. మన దేశానికి కూడా ఇలాంటి వ్యక్తి కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు....
ముంబయి: పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఆసక్తికర పోస్టులు చేస్తూ ఉంటారు. దేశ విదేశాల్లోని ప్రతిభావంతులకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ వారిని ప్రశంసిస్తుంటారు. ఆదివారం సైతం అదే తరహా వీడియోను పంచుకున్నారు ఆనంద్ మహీంద్రా. విదేశాలకు చెందిన ఓ బుడతడి వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేస్తూ అతడి వేగాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ బాలుడిని యంత్రంతో పోల్చారు. మన దేశానికి కూడా ఇలాంటి వ్యక్తి కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘అతడు మెషీన్లా ఉన్నాడు. బాలుడు పరుగెడుతున్నప్పుడు అతని కాళ్లు కనిపించనంత వేగంగా కదులుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వ్యక్తిగా తయారవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 1.2 బిలియన్లు మంది ఉన్న మన దేశంలో ఈ తరహా ప్రతిభావంతులు లేరా? కచ్చితంగా ఉంటారు. వారిని వెలికితీయాలి. మీ సెల్ఫోన్లను సిద్ధం చేసుకోండి’ అంటూ ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి...
ఆనంద్ మహీంద్రా ట్వీట్.. నోరెళ్లబెట్టిన నెటిజన్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు