అక్టోబరు వరకూ విస్తారంగా వర్షాలు..!
దక్షిణాది, ఈశాన్య రాష్ర్టాల్లో ఈ ఏడాది అక్టోబరు వరకూ విస్తారంగా
వెల్లడించిన భారత వాతావరణ శాఖ..
న్యూదిల్లీ: దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ఏడాది అక్టోబరు వరకూ విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా జులై 1 నుంచి ఇప్పటి వరకూ సాధారణం కంటే 6.1 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవటంతో వారం కిందట వరకూ దక్షిణ భారతం, ఈశాన్య రాష్ట్రాల్లో 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణంలో ఈ మార్పులు చోటు చేసుకున్నట్లు వాతావరణ శాఖ నివేదికలో తెలిపింది.
రెండు మూడు రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ద్రోణి వల్ల సెప్టెంబరు మాసం చివరి వరకూ దక్షిణ, ఈశాన్య, తూర్పు భారతంలో అధిక వర్షాలు పడనున్నాయట. ఇదే సమయంలో వాయవ్య భారత రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా సెప్టెంబరు మాసంలో సాధారణం కంటే 12.6 లోటు వర్షపాతం నమోదైంది. ఇది వాయవ్య ప్రాంతంలో 52.8 ఉండగా, మధ్య భారతావనిలో 33.2 లోటు వర్షపాతంగా రికార్డైంది. అల్పపీడనం పెరుగుదల వల్ల పశ్చిమదిశగా వీచే పవనాలు వచ్చే వారానికి మరింత బలపడతాయని జాతీయ వాతావరణ సూచన ఉన్నతాధికారి సతీదేవి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?