ఎల్బీనగర్ వద్ద 2కి.మీల మేర ట్రాఫిక్ జామ్!
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. ఎల్బీనగర్ వద్ద జాతీయ రహదారి డైవైడర్ నుంచి వరదనీరు పొంగిపొర్లుతోంది..........
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. ఎల్బీనగర్ వద్ద జాతీయ రహదారి డైవైడర్ పైనుంచి వరదనీరు పొంగిపొర్లుతోంది. దీంతో దాదాపు రెండు కి.మీ.లమేర వాహనాలు నిలిచిపోయాయి. పనామా - ఎల్బీనగర్ రహదారి జలమయం కావడంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎల్బీనగర్లో ఈ రోజు దాదాపు 7సెం.మీల మేర వర్షం కురిసింది. మెహదీపట్నం, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి రహదారిపై వాహనాలు నెమ్మదించాయి. గచ్చిబౌలి, నానక్రామ్గూడ, నార్సింగి, లంగర్హౌజ్, మెహదీపట్నం మీదుగా వాహనాలను దారిమళ్లిస్తున్నారు.
పాతబస్తీలోని బాబానగర్లో భారీగా వరద నీరు పారుతోంది. బాలాపూర్ చెరువు నీళ్లతో వీధుల్నీ జలమయమయ్యాయి. గోల్నాక కొత్త వంతెనపై భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. ముసారాంబాగ్ వంతెనపై రాకపోకలు నిషేధించారు. గోల్నాక వంతెనపై నుంచి వాహనాల దారిమళ్లింపుతో అక్కడ రద్దీ పెరిగింది. శంషాబాద్, మల్కాజిగిరిలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఉప్పల్లో వరంగల్ జాతీయ రహదారిపై వరద ప్రవాహంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షం ధాటికి ఫలక్నుమా ఓవర్ బ్రిడ్జిపై గుంత ఏర్పడింది. గతంలో వర్షానికి మూడు రోజుల పాటు ఈ వంతెన జలదిగ్బంధంలోనే ఉంది.
బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా వరదనీరు చేరింది. దీంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ముందు జాగ్రత్తగా గగన్పహాడ్ వైపు రాకపోకలను నిలిపివేశారు. పీవీ ఎక్స్ప్రెస్ వే మీదుగా బెంగళూరు, విమానాశ్రయం వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. బెంగళూరు వైపు వెళ్లే వాహనదారులు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా