‘ప్రభుత్వానికి ప్రణాళిక లేదని భావించాలా?’
రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువ సంఖ్యలో చేస్తున్నారని తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా కేసులు, పరీక్షలపై ఇవాళ ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. విచారణకు ముందు కేసులు పెంచి తర్వాత తగ్గిస్తున్నట్లు కనిపిస్తోందని విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో రోజుకు...
తెలంగాణ సర్కార్ని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువ సంఖ్యలో చేస్తున్నారని తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా కేసులు, పరీక్షలపై ఇవాళ ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. విచారణకు ముందు కేసులు పెంచి తర్వాత తగ్గిస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో రోజుకు 50వేల కొవిడ్ పరీక్షలు చేయాలని.. ఆ సంఖ్యను లక్ష వరకు పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా రెండో దశ ముప్పు పొంచి ఉందని.. ఇలాంటి సమయంలో భౌతికదూరం, మాస్కులు ధరించడం వంటి మార్గదర్శకాలు సరిగా అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని.. మార్గదర్శకాలు పాటించేలా ప్రజలను ఆదేశించాలని తెలిపింది. కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేసిన ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొవిడ్పై డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రణాళికలు సమర్పించట్లేదని అసహనం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణపై ప్రభుత్వానికి అసలు ప్రణాళిక లేదని భావించాలా? అని ప్రశ్నించింది. ఈ నెల 24లోగా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు